చిరుధాన్యాల సాగు పెంపు లక్ష్యంగా పనిచేయ్యాలి

తాళ్లూరు మండలంలో చిరుధాన్యాలు, ప్రకృతి వ్యవసాయం పెంపు లక్ష్యంగా 2023లో పనిచేయనున్నట్లు వ్యవసాయాధికారి ప్రసాదరావు తెలిపారు. గత సంవత్సరం సజ్జలు, కొర్రలు, వరిగలు 119 ఎకరాలలో సాగు చేసారని చెప్పారు. 2023 అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన నేపధ్యంలో మండలంలో 2వేల ఎకరాల సాగు లక్ష్యంగా పనిచేయటానికి నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ప్రతి ఆర్బీకేలలో చిరుధాన్యాల వలన తక్కువ ఖర్చు, ఎక్కువ దిగుబడి, రాబడి ఉంటుందని ప్రచారం నిర్వహించనున్నట్లు వివరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *