ఉత్తమ కెవికే అవార్డు పొందిన దర్శి కృషి విజ్ఞాన కేంద్రం

దర్శి కృషి విజ్ఞాన కేంద్రం (కెవికే) ఉత్తమ కృషి విజ్ఞాన కేంద్రం అవార్డును స్వంతం చేసుకున్నది. బాపట్లలో గుంటూరు ఆచార్య ఎన్. జి రంగా విశ్వవిద్యాలయంలో
జరిగిన 52వ పరిశోధన మరియు విస్తరణ సలహా మండలి సమావేశంలో శుక్రవారం ఈ అవార్డును ప్రదానం చేసారు. ఆచార్య ఎన్ జి రంగా విశ్వవిద్యాలయం, గుంటూరు 2021-22 వార్షిక సంవత్సరంలో రైతులకు ఇతర అనుబంధ రంగాలను ప్రోత్సహిస్తూ అందించిన సేవలను గుర్తిస్తూ వారి ప్రతిభకు ప్రోత్సాహకంగా ఈ అవార్డు దక్కినది. దర్శి కేవికే కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్. వి. వి. ఎస్ దుర్గా ప్రసాద్ కు అవార్డును అగ్రూ ఉప కులపతి డాక్టర్ ఎ విష్ణు వర్థన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు (మార్కేటింగ్) బత్తుల బ్రహ్మానంద రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు (వ్యవసాయ) ఐ తిరుపాల్ రెడ్డిలు అవార్డును అందించారు. దర్శి కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రవేత్తలు, సిబ్బంది అందించిన సేవలను వక్తలు కొనియాడారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *