పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు… జిరాక్స్ సెంటర్లు మూసివేత.పరీక్షా కేంద్రాలకు ఎలాంటి స్మార్ట్ వాచ్, మొబైల్ ఫోన్స్, ఐపాడ్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు.పరీక్షా కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు మరియు పరీక్షకు కేటాయించిన సిబ్బంది తప్ప ఇతర సిబ్బంది గానీ వ్యక్తులు గానీ ఉండరాదు.మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ వంటి చర్యలకు విద్యార్థులు ఎవరైనా పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.ఈ నెల 3 నుంచి ఏప్రిల్ 18 వరకు ప్రతీ రోజు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం12.45 గంటల వరకు నిర్వహించు పదవ తరగతి పరీక్షలు సజావుగా జరిగేలా పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు చేసినట్లు మీడియా సమావేశము ద్వారా తెలియజేశారు. సీఐ రామకోటయ్య ,ఎస్సై రామకృష్ణ సమావేశంలో పాల్గొన్నారు
పదవ తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: దర్శి డి.ఎస్.పి నారాయణస్వామి రెడ్డి
02
Apr