ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుల అసోసియేషన్ జిల్లా కార్యవర్గ ఎన్నిక ఆదివారం జరిగింది. జిల్లా అధ్యక్షులుగా పూసలపాడు వైద్యాధికారి డాక్టర్ కె. రాహుల్, జిల్లా జనరల్ సెక్రటరీగా తూర్పు గంగవరం వైద్యాధికారి డాక్టర్ బంకా రత్నం ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. జిల్లా కార్యవర్గం కమిటీలో ఉపాధ్యక్షులుగా డాక్టర్ ఎం ఒనారి యేలు, కె. సరస్వతి, జాయింట్ సెక్రటరీలుగా వి జ్యోతి, పి. ప్రవీణ్, వి. సునీల్ నాయక్, ఆర్గనైజింగ్ సక్రటరీగా కాజ నాయబ్రసూల్, పబ్లిసిటీ సెక్రటరీగా కరవది డాక్టర్ ఎం. సుం దర్ ప్రసాద్, ట్రెజరర్ ఎం. రమేష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా చైతన్య దీపక్, అక్తర్ రసూల్, కె. శ్రీధర్ రెడ్డి, కె. రజత మానస, బి. కిరణ్మయి, ఎన్. నాగరాజ్యలక్ష్మి ఎంపిక య్యారు. జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే డాక్టర్ల సంక్షేమం, సమస్యల పరి ష్కారంపై అసోసియేషన్ కృషి చేస్తున్నట్లు నూతన కార్యకవర్గం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుల అసోసియేషన్ జిల్లా కార్యవర్గ ఎన్నిక నిర్వహణ – జిల్లా అధ్యకుడిగా డాక్టర్ రాహుల్, జిల్లా కార్యదర్శి గా డాక్టర్ రత్నం ఏకగ్రీవ ఎన్నిక
03
Apr