సంక్షేమ రాజ్యం అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు చల్లటి దీవేనలు అందించాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కోరారు. జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని తిరునాళ్ల సందర్భంగా వైఎస్సార్సీపీ, బూచేపల్లి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శివరామపురం, తూర్పుగంగవరం, నాగంబొట్లపాలెం విద్యుత్ ప్రభలపై ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ…… నిత్యం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రతి పక్షాలు లేని పోని ఆరోపణలు చేసుకుంటూ పోతున్నాయని అన్నారు. ప్రతి పక్షాలు, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా సరే రాబోవు 2024 ఎన్నికలలో ప్రజలు సీఎం వైస్ జగనన్నకు మళ్లీ పట్టం కట్టటానికి సిద్దంగా ఉన్నారని అన్నారు.
ప్రతి లబ్దిదారుడు సీఎం వైఎస్ జగన్ ను స్మరించుకుంటున్నారని గుర్తు చేసారు. పార్టీ అభ్యున్నతికి తమ కుటుంబం ఎల్లవేళలా కట్టుబడి ఉంటుందని చెప్పారు. అనంతరం ప్రభల నిర్వాహకులు చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మను, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలను గజమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్మెంబర్ షేక్ ఆదాం షరీఫ్, మాజీ ఎంపీపీలు కోట రామిరెడ్డి, పోశం మధుసూధనరెడ్డి, గోళ్లపాటి మోషే, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఐ.వీ సుబ్బారెడ్డి, కోట వెంకట రామిరెడ్డి, మాజీ ఎఎంసీ డైరెక్టర్లు గుజ్జుల యోగిరెడ్డి, జి. శ్రీనివాసరెడ్డి, కుమ్మిత శ్రీనివాస రెడ్డి, దారం వెంకటేశ్వర రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి జక్కుల రామక్రిష్ణ, ఎంపీటీసీ యామర్తి ప్రభుదాస్, సొసైటీ మాజీ చైర్మన్ నాగి రెడ్డి, శివరామపురం సర్పంచి బొడ్డు రాములు, ఆలోకం హరిబాబు, మన్నం వేణు, కాశిరెడ్డి, వీరాంజి రెడ్డి, అనపర్తి కృపయ్య తదితరులు పాల్గొన్నారు.





