వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధనను నెల్లూరులో శనివారం వైఎస్సార్సీపీ తాళ్లూరు మండల ఇంచార్జ్ మద్దిశెట్టి రవీంద్ర, జెడ్పీటీసీ మారం వెంకటరెడ్డి కలిసారు. వ్యవసాయశాఖలో మద్ధతు ధర కల్పించి ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. గంగిరెడ్డి పాలెం యలమందా రెడ్డి, కళింగ రెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు.
