తాళ్లూరు మండలం లో అకాల వర్షం వడగళ్ల గాలి వానకు దెబ్బతిన్న పంటలను సోమవారం వ్యవసాయాధికారి ప్రసాదరావు, సిబ్బంది పరిశీలించారు. కొత్తపాలెం,
శివరామపురం, నాగం బొట్లపాలెం గ్రామాలలో దెబ్బతిన్న అరటి తోటలను
పరిశీలించారు. ఆయా గ్రామాలలో 15 ఎకరాల వరకు అరటి తోటలుదెబ్బతిన్నట్లు ప్రాధమిక అంచానకు వచ్చినట్లు ఎవో తెలిపారు. విఏఏ నాగరాజు నాయక్, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దెబ్బతిన్న పంటలను పరిశీలించిన వ్యవసాయాధికారి
24
Apr