నాయి బ్రాహ్మణుల థాంక్యూ సీఎం కార్యక్రమాన్ని జెండా ఊపి బస్సులను ప్రారంభించిన చీరాల వైయస్సార్సీపి ఇంచార్జ్ కరణం వెంకటేష్

చీరాలలో డాక్టర్ హైమా సుబ్బారావు అధ్యక్షతన తాడేపల్లిలో జరిగేటటువంటి నాయి బ్రాహ్మణుల థాంక్యూ సీఎం కార్యక్రమాన్ని చీరాల గడియార స్తంభం సెంటర్ నందు జండా ఊపి బస్సులను ప్రారంభించిన చీరల వైఎస్సార్సీపి ఇంచార్జ్ కరణం వెంకటేష్ ,

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా కరణం వెంకటేష్ మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి నాయి బ్రాహ్మణులకు అనేక సంక్షేమ పథకాలను మరియు సమాజంలో మంచి గుర్తింపు ఇచ్చేందుకు ఎంతగానో ముఖ్యమంత్రి కృషి చేశారని, చీరాల నియోజకవర్గ నాయి బ్రాహ్మణులకు చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి మరియు నేను ఎప్పుడు అండగా ఉంటానని తెలియజేశారు,

డాక్టర్ హైమ సుబ్బారావు మాట్లాడుతూ జీవో నెంబర్ 50 ద్వారా నాయి బ్రాహ్మలకు అట్రాసిటీ కేసు మరియు ప్రతి సంవత్సరం షాప్ కి 10000 ,ప్రతి దేవాలయంలోని పాలకమండలిలో ఒక సభ్యుడు ,షాప్ కి 150 యూనిట్స్ కరెంటు, దేవాలయాల్లో పని చేసే క్షౌవర వృత్తి దారులకు నెలకు 20వేల రూపాయల శాలరీ మరియు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు

డాక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ గతంలో ఏ ముఖ్యమంత్రి చెయ్యని
విధంగా నాలుగు సంవత్సరాల లో నాయి బ్రాహ్మలకు
అనేక పథకాలు మరియు సమాజంలో రాజకీయంగా మంచి గుర్తింపు ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కి జీవితాంతం రుణపడి ఉంటామని ,అదేవిధంగా మరల 2024లో సీఎం జగన్మోహన్ రెడ్డి అవ్వాలంటే చీరాలలో కరణం వెంకటేష్ ని భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం మనందరికీ ఉందని తెలియజేశారు,

ఈ కార్యక్రమంలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి
డాక్టర్ తాడివలస దేవరాజు, చీరాల పట్టణ అధ్యక్లు మచవరపు వెంకటేశ్వర్లు,
వల్లూరి వెంకట స్వామి , మార్కాపురం వెంకట రామ రావు, ఆతిన బోసు బాబు, కలవకూరి బల శంకర్, నటరాజు, భీమవరపు కృష్ణ ,మాస్టర్ వోలేటి మల్లికార్జున రావు, వల్లూరి శ్రీనివాస్ రావు, మెడిసెట్టీ సత్యనారాయణ ,కొరవడ సత్యనారాయణ, పట్నాల శివ, కశింకోట శివ ,వల్లూరి వెంకట సుబ్బా రావు,పెద్దపల్లి నూకరాజు, బొద్దులపటి శ్రీనివాస్ ,యమర్తి బాల పున్నయ్యా, మల్లవరపు కన్నయ్య, భట్టిప్రోలు శ్రీనివాస్, బోయిలపల్లి ద్రాక్ష రామ్, యేసు బాబు, ధరణికోట శ్రీనివాసరావు, సీతమ్మ,, స్వర్ణ పున్న రావు, ఓడరేవు శ్రీను, దొండపుడి రాజ, కల్వకూరి వీరరాఘవయ్య, స్వర్ణ వెంకటేశ్వర్లు, చీరాల ,పేరాల ,వేటపాలెం మండలాల నుండి నాయి బ్రాహ్మణ నాయకులు మరియు సంఘీయులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *