దర్శి నగర పంచాయితీ కార్యాలయంలో సోమవారం సీనియర్ సివిల్ జడ్జి, లోక్ అదాలత్ చైర్మన్ జి.ఎల్ ప్రసాద్ ఆదేశాల మేరకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. నగర పంచాయితీ కమీషనర్ వై . మహేశ్వరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. న్యాయ వాదులు సుబ్బారెడ్డి, మనోహరమ్మలు మున్సిపల్ సిబ్బంది, కార్మికులకు చట్టాలపై, హక్కులపై అవగాహన కల్పించారు. న్యాయ పరమైన సహాయం, అవగాహన కోసం లోక్ అదాలత్ చేస్తున్న కృషిని వివరించారు..
