ప్రజా ప్రతినిథులు సమన్వయంతో వ్యవసాయశాఖ ద్వారా అమలు
అవుతున్న పథకాలు అన్ని సక్రమంగా అమలు చేయటం సాధ్యమని వ్యవసాయాధికారి ప్రసాద్ రావు తెలిపారు. బొద్దికూరపాడు రైతు భరోసా కేంద్రంలో బుధవారం ప్రజా ప్రతినిధులు, రైతులతో సమావేశం నిర్వహించారు. కమ్యునిటి హైరింగ్ సెంటర్కు సంబంధించి రాయితీపై యంత్ర పరికరాలు పొందేందుకు సమన్వయం ఎంతో అవసరమని, అందరూ కలసి కట్టుగా పథకాల అమలు ప్రక్రియ ముందుకు తీసుకువెళ్లటానికి అధికారులు సహకరించాలని కోరారు. ఉప సర్పంచి పులి ప్రసాద్ రెడ్డి, విఆర్డీ నాగేశ్వరరావు, విఏఏ అజ్మీర్ తదితరులు పాల్గొన్నారు.
సమన్వయంతో వ్యవసాయ పథకాలు అమలు – ప్రజా ప్రతినిథులు సహకారంఎంతైనా అవసరం
03
May