ముండ్లమూరు రైతులు వ్యవసాయ నూతన కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని విద్యుత్ ఏ ఇ. జే భూరాజు అన్నారు. స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ లో గురువారం ఆయన వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు విద్యుత్తు అందించడంలో భాగంగా రైతుల నుండి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల రైతులు అందరూ దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. దరఖాస్తు చేసుకునే రైతులు బోరు వేసి ఉండాలి, సర్వే నెంబరు తెలియజేయాలి, వీఆర్వో ధ్రువకరించిన సర్టిఫికెట్ తీసుకురావాలి, పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, సచివాలయంలో ఆన్లైన్ చేసిన జిరాక్స్ కాపీ, ఎస్టిమేట్ వేయించుకున్న కాఫీ లు జత పరచాలని ఆయన తెలియజేశారు.
వ్యవసాయ కనెక్షన్ ల కోసం దరఖాస్తు చేసుకోవాలి
04
May