దర్శి మండలంలోని గౌతమి గ్రామస్ స్కూల్ విద్యార్థులు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో తమ ప్రతిభ చాటినట్లు సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ పి. రాజకేశవ రెడ్డి తెలిపారు. పాఠశాలకు చెందిన షేక్ హబీబా సుల్తానా (590), మద్దాలి ప్రియ అస్మిత (586), కాసు గౌతమి (577), మండాది యోగేశ్వరావు (573), షేక్ చరిష్ఠ (573), ఆవుల హర్షసాయి అఖిల (568), మారం క్రిష్ణ భరత్ రెడ్డి (567), గూడాల వెంకట నాగ హర్షిత (566), మద్దాలి ప్రేమ్ అన్విష్ (566), ఒగ్గు మౌనిష సాయి శరణ్య (562), దుగ్గి రెడ్డి అదీప్ రెడ్డి (557), పూజారి మాధవి (553), కాటం వైష్ణవి (551). చిన్నపురెడ్డి హేమంత్ రెడ్డి (550), మార్కులు సాధించారని తెలిపారు. 550పైగా మార్కులకు పైగా 15 మంది, 500 మార్కులు పైగా 41 మంది సాధించారని తెలిపారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ పి. రాజకేశవ రెడ్డి అభినందనలు తెలిపారు.
