తాళ్లూరు దోర్నపువాగు సమీపంలోని పొలాల్లో విద్యుత్తు స్తంభాన్ని శనివారం రాత్రి 10.50 నిమిషాల సమయంలో కోళ్ల వ్యర్ధాల వాహనం ఢీకొట్టింది. దీంతో ట్రాన్స్ఫార్మర్ ట్రక్కుపై పడింది. విద్యుత్ సరఫరా ఉన్నప్పటికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ట్రక్కులో ఉన్న మహిళలు కూలీలు ఊపిరి పీల్చుకున్నారు . ప్రమాదాన్ని గమనించిన స్థానికులు సమాచారాన్ని విద్యుత్ సబ్స్టేషన్ సిబ్బందికి ఫోన్లో సమాచారం ఇవ్వడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు . సంఘటన స్థలాన్ని పరిశీలించి వాహనదారులను అప్రమత్తం చేశారు .
