అమరావతి కేసుతో పాటు ఆర్ 5 జోన్ కేసునూ కలిపి వినాలని నిర్ణయించిన సుప్రీం ధర్మాసనం
అమరావతి కేసును విచారిస్తున్న జస్టిస్ జోసెఫ్ ధర్మాసనం ముందు ఆర్ 5 జోన్ పిటీషన్ ను బదిలీ చేయాలని ఆదేశించిన సుప్రీం ధర్మాసనం
శుక్రవారం లోగానే రెండు పిటీషన్లపై విచారణకు జస్టిస్ జోసెఫ్ ధర్మాసనం ముందు లిస్ట్ చేయాలని రిజస్ట్రీకి ధర్మాసనం ఆదేశం
రైతుల తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, ముకుల్ రొతగి, శ్యాందివాన్, దేవ్ దత్ కామత్
తదుపరి విచారణ వరకూ స్టే ఇవ్వాలని కోరిన హరీశ్ సాల్వే అడ్డుపడిన ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాదులు
అమరావతి పిటీషన్ పెండింగ్ లో ఉన్నందునే హైకోర్టు ఆర్ 5 జోన్ పైన మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని ధర్మాసనం ద్రుష్టికి తెచ్చిన ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది నిరంజన్రెడ్డి.
ఆర్ 5 జోన్లో వేరే ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాల కేటాయింపు పై హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని, రాష్ట్ర ప్రభుత్వ జీవోలను రద్దు చేయాలని సుప్రీంను కోరిన రైతులు
అమరావతి మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవోలు తీసుకొచ్చిందన్న రైతులు
రైతులు దాఖలు చేసిన మద్యంతర అప్లికేషన్లను తిరస్కరించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
కోర్టు తుది ఉత్తర్వులకు లోబడి వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం
మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు విముఖత చూపుతూ ఆదేశాలు ఇచ్చిన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం
హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి దాఖలు చేసిన రైతులు
గతంలో హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వలేదని తగిన ఉత్తర్వులు ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్ ని వెనక్కి తీసుకున్న రైతులు.
హైకోర్టు ఇచ్చే ఉత్తర్వుల ఆధారంగా మరోసారి సుప్రీంకోర్టు ను ఆశ్రయించేందుకు అవకాశం కల్పించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివైస్ నేతృత్వంలోని ధర్మాసనం
సుప్రీం ధర్మ ఆసనం కల్పించిన అవకాశం మేరకు రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన అమరావతి రైతులు
న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్జిస్ రాజేశ్ బిందాల్ లతో కూడిన ధర్మాసనం ముందు విచారణ.