జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగాభవాని అమ్మవారికి ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. పూజారులు విజయలక్ష్మి, ప్రకాశరావు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అమ్మవారికి భక్తులు పన్నేండు చీరల బహుకరించారు. ఆలయానికి రూ. 17,234 ఆదాయం వచ్చినట్లు ఆర్ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. భక్తులకు సౌకర్యాలను ఈఓ భాస్కర్ రెడ్డి పర్యవేక్షించారు.
గుంటి గంగా భవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు
21
May