రాష్ట్రంలోని వివిధ ప్రమాదకర మరియు ప్రమాదకరమైన రసాయన పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు.ఇటీవల అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని సాహితీ ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై తీసుకున్నచర్యలపై బుధవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సిఎస్ సమీక్షించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రమాదకర మరియు ప్రమాదకర రసాయన పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టం చేశారు.అలాంటి పరిశ్రమలను వెంటనే మ్యాపింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు.అదే విధంగా పరిశ్రమలు,ఫైర్ తదితర విభాగాల అధికారులతో కూడిన బృందం ప్రతిఏటా తప్పని సరిగా ఆయా పరిశ్రమలను తనిఖీ చేయాలని చెప్పారు.ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఫైర్ సేప్టీ ఆడిట్ నిర్వహించి ఎక్కడైనా లోపాలుంటే ఆయా పరిశ్రమలకు నోటీసులు జారీ చేసి వాటిని సరిద్దేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలని అగ్నిమాపక విభాగ అధికారులను సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.
ఇటీవల కాలంలో వివిధ సాల్వెంట్ పరిశ్రమలు ఎక్కడపడితే అక్కడ కుటీర పరిశ్రమలు మాదిరిగా ఏర్పాటవుతున్నాయని వాటిని నిర్వహించే వ్యక్తుల సామర్ధ్యాన్ని,భద్రతకు తీసుకుంటున్నచర్యలను పూర్తిగా పరిశీలించాకే లైసెన్సులు జారీ చేయాలని సిఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.వివిధ ప్రమాదకర పరిశ్రల్లో ప్రమాదాల నివారణకు పూర్తి స్థాయిలో మాక్ డ్రిల్ లను నిర్వహించాలని చెప్పారు.
రాష్ట్ర ఫ్యాక్టరీల డైరెక్టర్ డిసిఎస్ వర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో 26 వేల వరకూ వివిధ ఫ్యాక్టరీలు ఉండగా వాటిలో 1500 వరకూ ప్రమాదకర ఫ్యాక్టరీలు ఉన్నాయని ఇలాంటి పరిశ్రమల్లో ఏడాదికి ఒకసారి తనిఖీలు చేయడం జరుగుతుందని వివరించారు.మిగతా ఫ్యాక్టరీల్లో రేండేళ్ళకు ఒకసారి మరికొన్ని చిన్న పరిశ్రమల్లో మూడేళ్ళకు ఒకసారి వంతున తనిఖీలు చేయడం జరుగుతుందని తెలిపారు.అలాగే మాక్ డ్రిల్లు,స్పెషల్ డ్రైవ్ లు కూడా చేపడతామని,ప్రమాదాలు జరిగిన వెంటనే తనిఖీలు చేసి నివేదికలు సమర్పిస్తామన్నారు.
డైకెర్టర్ ఆఫ్ బాయిలర్స్ ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 3500 వరకూ బాయిలర్స్ ఉండగా వాటిలో చాలా వరకూ అనగా 2200 వరకూ రైస్ మిల్లుల్లోనే ఉన్నాయని చెప్పారు.గత ఐదేళ్ళ నుండి బాయిలర్స్ కు సంబంధించి ప్రమాదాలేమీ జరగలేదని వివరించారు.ప్రతి యేటా ఆయా బాయిలర్స్ వాటికి అనుసంధామై ఉన్న పైపులైన్లను తనిఖీ చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్లను జారీ చేయడం జరుగుతోందని తెలిపారు.
రాష్ట్ర అగ్నిమాపక విభాగం డైరెక్టర్ డి.మురళీ మోహన్ మాట్లాడుతూ నేషనల్ బిల్డింగ్ కోడ్ ను అనుసరించి పైర్ సేప్టీ లైసెన్సులను జారీ చేయడం జరుగుతుందని వివరించారు. ప్రమాదకర పరిశ్రమల్లో ఏటా తనిఖీలు చేయడం జరుగుతుందని చెప్పారు.
ఈసమావేశంలో రాష్ట్ర కార్మిక,ఫ్యాక్టరీల శాఖ కార్యదర్శి యం.హరి జవహర్ లాల్,డెరెక్టర్ ఫైర్ సర్వీసెస్(ట్రైనింగ్) పివి రమణ,కాలుష్య నియంత్రణ మండలి జాయింట్ సిఇ తోపాటు వీడియో లింక్ ద్వారా పరిశ్రమల శాఖ కమీషనర్ ప్రవీణ్ కుమార్,కార్మికశాఖ కమీషనర్ యంవి.శేషగిరి బాబు,అనకాపల్లి జిల్లా కలక్టర్ రవి,ఎస్పి తదితర అధికారులు పాల్గొన్నారు.
ప్రమాదకర రసాయన పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి- ప్రమాదకర,రసాయన పరిశ్రమలన్నిటినీ మ్యాపింగ్ చేయండి-నిర్వహణ సామర్ధ్యాన్ని పరిశీలించాకే లైసెన్సులు జారీ చేయాలి-ప్రమాదకర పరిశ్రమల్లో తప్పని సరిగా ప్రతి ఏటా తనిఖీలు నిర్వహించాలి- క్రమం తప్పకుండా ఫైర్ సేప్టీ ఆడిట్లను నిర్వహించాలి-ప్రమాదకర పరిశ్రమల్లో పూర్తి స్థాయిలో మాక్ డ్రిల్ లను నిర్వహించాలి- రాష్ట్ర,జిల్లా క్రైసెస్ గ్రూప్ కమిటీలు క్రమం తప్పక సమావేశమై ప్రమాదాలపై సమీక్షించాలి -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి
26
Jul