ప్రతి ఒక్కరూ మొక్కలు నాటినట్టయితే పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయని టిడిపి ప్రకాశం మాజీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు పరిటాల సురేష్ అన్నారు. ముండ్లమూరు మండలంలోని పులిపాడు గ్రామంలో సోమవారం గుద్దేటి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవులలో వృక్ష సంపద తగ్గిపోతున్నాయని అందువల్ల వర్షాలు సకాలంలో కురవడం లేదన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పచ్చదనాన్ని పెంచే బాధ్యత తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో గోపి ,గురవయ్య, సుబ్బారావు , ఏరేసి వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
