బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సమీపంలో నవంబర్ 27న అల్పపీడనం ఏర్పడనుంది – భారత వాతావరణ కేంద్రం అదికారులు వెల్లడి

బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సమీపంలో నవంబర్ 27న అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ కేంద్రం అదికారులు వెల్లడించారు. ఇది ఈనెల 29 నాటికి వాయుగుండంగా బలపడుతుందని చెప్పారు. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాలోలో ఆరు రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. నేడు అల్లూరి సీతారామరాజు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రదేశాలలో చాలా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాసం ఉందని వెల్లడించారు. ఇక గత నాలుగైదురు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వరి, పత్తికి కొద్దిగా నష్టం వాటిల్లిందని రైతులు చెబుతున్నారు. వరి పైరు కోసి.. నూర్చి ఆరబోసిన ధాన్యం తడిసింది. కొన్ని చోట్ల ధాన్యం కుప్పలు తడిసి రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ వర్షంతో దక్షిణ కోస్తా జిల్లాల్లోని పత్తి పొలాల్లో తీయాల్సిన పత్తి కూడా స్వల్పంగా తడిసింది. ప్రస్తుత వర్షాలు వరి, పత్తి రైతులకు నష్టం చేస్తుండగా.. ఇతర పంటలకు ఉపయోగపడుతున్నాయి. గతవారం బంగాళాఖాతంలో ఏర్పడినా.. రాష్ట్రంలో పెద్దగా ప్రభావం చూపలేదు..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *