కుటుంబానికి అవసరమైన అన్ని కూరగాయలు, మెడిసిన్ ప్లాంట్స్ ప్రకృతి వ్యవసాయంతో పండించటం అభినందనీయమని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మెనేజర్ సుబాషిణి అన్నారు. మండలంలోని సూరా రెడ్డి పల్లెలో పద్మావతి అను రైతు ఒక ఎకరంలో కుటుంబానికి అవసరమైన మినుము, కంది, మిరప, వంగ, టమెటో, చిక్కుడు, బీర, సొర్ర, చిక్కుడతో పాటు పలు కూరగాయలు, మెడిసిన్ ప్లాంట్స్ కూడ ప్రకృతి వ్యవసాయంతో పెంచటం ఎంతో ఆసక్తి కరమని అన్నారు. ఆమె ప్రకృతి వ్యవసాయం ఆదర్శనీయమని చెప్పారు.



