వాసవి క్లబ్స్ అంతర్జాతీయ సేవా సంస్థ జిల్లా 205 లోని వాసవిక్లబ్ ఒంగోలు సిటిజన్స్ కు వైబ్రంట్ ఇయర్ 2024 కి కార్యవర్గ సభ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈమేరకు అధ్యక్షులుగా ఏల్చూరి నగేష్ గుప్తా, కార్యదర్శిగా భూమా శ్రీనివాసులు మరియు కోశాధికారిగా బియ్యపు సంపత్ లు తమ అనుమతి పత్రాలను వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధికారులకు అందించారు. కార్యక్రమంలో రీజన్ చైర్మన్ టి. రంగస్వామి, జోన్ ఛైర్మన్ చీదెళ్ల వేంకట ప్రసాదు, రీజియన్ కార్యదర్శి అమరా సత్యనారాయణ తదితర క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
