భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం గణతంత్య్ర దినోత్సవం నిర్వహించారు. అసెంబ్లీ కన్వినర్ వైసీ యోగయ్య యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించగా పార్టీ జిల్లా అధ్యక్షుడు పివీ శివా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఎగురవేసి సందేశం అందించారు. మాజీ ఎమ్మెల్యే దార సాంబయ్య, రాయపాటి అజయ్, బసుపల్లి రాజశేఖర్, సీతారామయ్య, సత్యవతి, క్రిష్ణవేణి, రాధా క్రిష్ణ మూర్తి, సుధాకర్ యాదవ్, తిరుమల, సంజీవకుమార్ యాదవ్, ప్రసాదరావు,శ్రీనివాసరావు,శివ, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
