పంటలను బెట్ట పరిస్థితులను నుండి కాపాడుకోవటానికి పాటించాల్సిన విధానాన్ని వ్యవసాయాధికారి ప్రసాదరావు వివరించారు. తాళ్లూరులో పలు పంటలను గురువారం ఆయన పరిశీలించారు. పైర్లను రక్షించుకోవటానికి తేలిక పాటి స్పింకర్ల తడులు 15 రోజులకు ఒక సారి అవకాశాన్ని బట్టి రెండు సార్లు ఇవ్వాలని చెప్పారు. ద్రవ జీవామృతాన్ని కూడ పిచికారి చేసుకోవాలని కోరారు. ఎఈఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
