రాబోవు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి నాయకులు కార్యకర్తను కలుపుకుని ఇంటింటికి తిరిగి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం నిర్వహించి గావ్ ఛలో అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని బిజేపి జోనల్ ఇన్చార్జి సన్నా రెడ్డి దయాకర్ రెడ్డి కోరారు. ఒంగోలు లోని బిజేపి కార్యాలయంలో గురువారం దర్శి, కొండేపి, ఒంగోలు నియోజక వర్గ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవి శివా రెడ్డి, జిల్లా ఇన్చార్జి రవిశంకర్, కిసాన్ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి క్రిష్ణా రెడ్డి, పార్లమెంటు కన్వినర్ శ్రీనివాసరావు, ఒంగోలు అసెంబ్లీ కన్వినర్ వైసీ యోగయ్య యాదవ్, ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

