రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని,భద్రత లేకుండా ప్రయాణం చేయడంతో రోడ్డు ప్రమాదం జరిగితే కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎస్సై వైవీ రమణయ్య అన్నారు. బుధవారం తాళ్లూరు బస్టాండ్ సెంటర్లో ద్విచక్ర వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ మధ్య కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ లేకపోవడంతో తలకు తీవ్ర గాయాలతో ఎక్కువశాతం మరణాలు సంభవించాయని తెలిపారు. తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ఓవర్ క్రాస్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పలువురికి ఈ చలానా విధించారు. ఆయన వెంట పిసీలు బ్రహ్మనాయుడు, మాలకొండయ్య ఉన్నారు.
