అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని దర్శి సీఐ షమీఉల్లా కోరారు. తాళ్లూరు మండలం లో సమస్యాత్మకంగా ఉన్న తురకపాలెంలో శనివారం ఆయన ప్రజలతో మాట్లాడారు. ప్రతి ఓటరు నిర్భ యంగా ఓటు వేయాలన్నారు. పోలింగ్ బూత్ ల వద్ద గొడవలు చేయకుండా ప్రశాంత వాతావరణం కల్పించాలన్నారు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డబ్బు,మద్యం వంటి ప్రలోభాలకు లోనుకాకుండా ప్రజా స్వామ్య స్ఫూర్తిని ఇనుమడింప చేసేలా వ్యవహరించాలన్నారు. ఎక్కడైనా ఓటర్లను ప్రలోభ పెట్టే కార్యక్రమాలు సాగిస్తే సమాచారం ఇవ్వాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీ ఓటర్లను భయబ్రాంతులకు గురి చేస్తే చర్యలు తప్పవన్నారు. ఎస్సై వైవీ రమ ణయ్య మాట్లాడుతూ.. గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాం తంగా ఎన్నికలు జరిగేలా అందరూ సహకరించాలని సూచించారు. గొడవల్లో తల దూర్చేవారిపై నిఘా ఉందన్నారు. గ్రామాల్లో కొత్తవ్యక్తులు, అనుమానితులు తిరిగితే చెప్పాలని సూచించారు.

