సనత్ నగర్ నియోజక వర్గం యూత్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గా బేగంపేట భగ వంతా పూర కు చెందిన దర్గా మురళిని నియమించారు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోత రోహిత్ ,సనత్ నగర్ నియోజక వర్గ అధ్యక్షులు ప్రియాంక లు మురళిని యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పోస్ట్ నుంచి సనత్ నగర్ నియోజక వర్గం యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షడు గా నియమిస్తూ నియామక పత్రం అందజేశారు.ఈ సందర్భంగా దర్గా మురళి మాట్లాడుతూ తనపై నమ్మకం తో సనత్ నగర్ నియోజక వర్గం యూత్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గా నియమించిన మోత రోహిత్.ప్రియాంక లకు కృతజ్ఞతలు తెలియ జేశారు.సనత్ నగర్ నియోజక వర్గం లో యూత్ విభాగాన్ని మరింత పటిష్టం చేస్తామని.అన్నారు.ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అధ్వర్యంలో నీ కాంగ్రెస్ పార్టీ ప్రజారంజకంగా పాలన సాగిస్తుందన్నరు.ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్కువ కాలం లోనే అమలు లోకి తెచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.పార్ల మెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి యూత్ కాంగ్రెస్ కృషి చేస్తుందని మురళి అన్నారు.

