ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో ఒంగోలు విద్యార్థులు తమ సత్తాను చాటారు. ఆయా కళాశాల చైర్మన్లు, ప్రిన్సిపాల్స్, డైరెక్టర్లు తమ విద్యార్థులు సాధించిన ఫలితాల పట్ల హర్షం వ్యక్తం చేసి తమ విద్యార్థులను అభినందించారు. •
సరస్వతి విద్యా సంస్థలో ..
సరస్వతి విద్యాసంస్థలలో సీనియర్ ఇంటర్ ఫలితాలలో కె సాయి కిరణ్ (991/100) సాధించి స్టైట్ టాప్ ర్యాంక్ సాధించినట్లు ఆ సంస్థ చైర్మన్ఎవీ రమణా రెడ్డి తెలిపారు. అదే విధంగా జూనియర్ ఇంటర్ లో సీహెచ్ ఉదయ్ కిరణ్ (466/470), ఎ వెంకట భాను ప్రకాష్ (466), ఎం అజయ్కుమార్ (466), కె హేమలత (466), ఎం. భాను ప్రకాశ్ (466) సాధించినట్లు తెలిపారు. 466 మార్కులు సాధించిన వారు 6 మంది, 465 మార్కులు పైన 11 మంది, 464 మార్కులు సాధించిన వారు 18 మంది . 460 మార్కులు సాధించిన వారు 126 మంది, 450 మార్కులు పైగా 248మంది, అలాగే జూనియర్ ఇంటర్ బైపీసీలో ఆర్ జెస్సీ (435/440) స్టేట్ టాప్ ర్యాంక్ సాధించినట్లు చెప్పారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను చైర్మన్ ఏవీ రమణా రెడ్డి, డైరెక్టర్లు ఏ గణేష్ రెడ్డి, ఎ గంగా శంకర్ రెడ్డి, సీఈఓ ఎస్వి సురేష్, డీన్స్, ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు.
