ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ 18 రకాల కులవృత్తుల వారికి ఉపయోగకరంగా ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన పథకం ద్వారా వారి కుటుంబ పోషణ వ్యాపార అభివృద్ధికై అతి తక్కువ వడ్డీ కి తొలి విడతలో లక్ష రూపాయలు దాకా ఋణాలు మంజూరు చేయడం జరుగుతుందని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ప్రజలకు చేరేలా కృషి చేయడం లేదని, బిజేపి కార్యకర్తలుగా లబ్ధిదారులను గుర్తించి పలువురిచే ధరఖాస్తు చేయిస్తున్నామని బిజేపి మహిళామోర్చా జిల్లా అధ్యక్షురాలు మలినేని గీతాంజలి తెలిపారు.
శుక్రవారం తదితర సామాజిక వర్గాలకు చెందిన రాధా, జానకి, లక్ష్మీ, కీర్తన, సుబ్బారావు లను గుర్తించి ప్రధాని విశ్వకర్మ యోజన కు ధరఖాస్తు చేయించారు.
ఈ సందర్భంగా మలినేని గీతాంజలి మాట్లాడుతూ విశ్వకర్మ యోజన పథకం ప్రజల్లోకి తీసుకెళ్లడానికి భారతీయ మహిళ మోర్చా ఆధ్వర్యంలో విశేషమైన కృషి చేస్తున్నామని, ఈ కార్యక్రమానికి స్థానిక బిజెపి మహిళా నాయకురాలు పెద్ద ఎత్తున సహకరిస్తున్నారని ఈ పథకం గురించి ప్రతి ఒక్కరికి వివరించి దరఖాస్తు చేయిస్తూ ముందుకు వెళుతున్నామని తెలిపారు.

