జాతీయస్థాయి క్రికెట్ పోటీల్లో శ్రీసరస్వతి విద్యా సంస్థల విద్యార్థులు రాణించడంతో ఆ సంస్థల చైర్మన్ ఏవీ రమణా రెడ్డి, డైరెక్టర్స్ గణేష్ రెడ్డి శంకరరెడ్డిలు వారిని అభినందించారు. ఈ నెల రెండో తేదీన రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ జుం జునాం జిల్లాలోని ఓఓ క్రీడామైదానంలో ఆం డ్రారం క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వ హించిన జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో ఆంధ్రప్ర దేశ్ రాష్ట్రం తరఫున సీనియర్స్, జూనియర్స్ విభా గాల్లో పాల్గొని విజేతలుగా నిలిచారు. శ్రీసరస్వతి విద్యార్థులు వినోద్, దేవేంద్ర, వినయ్, రాజేష్, నరసింహనాయుడు, అనిల్, సుధాకర్ లు ఉత్తమ ప్రతిభ కనబరిచి గెలుపులో కీలక పాత్ర పోషించినందుకు వారిని ప్రత్యేకంగా అభి నందించారు.
