భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బి విజయరావు బుధవారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖామంత్రి వై. సత్యకుమార్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో ఉన్న స్థానిక సమస్యలను మంత్రికి వివరించారు. ప్రభుత్వపరంగా వైద్యశాఖ యందు చర్యలు తీసుకోవాలని, కొన్ని వైద్యశాలల్లో సరైన సిబ్బంది లేక నార్మల్ డెలివరీ జరగాల్సిన చోట ఆపరేషన్ వరకు వెళ్లవలసి వస్తుందని, ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం నిమిత్తం ఆధునిక యంత్రాలను తెప్పించాలని, వైద్యరంగంలో మార్పులు తెచ్చి వైద్య శాఖామాత్యులుగా మీకంటూ ఒక గుర్తింపు తీసుకురావాలని కోరారు.
ప్రకాశం జిల్లా పర్యటనకు రావాలని మంత్రిని విజయరావు ఆహ్వానించారు, వీలు చూసుకుని తప్పకుండా జిల్లా పర్యటన చేస్తానని విజయరావుకి తెలిపారు.
