బేగంపేట విమానాశ్రయంలో ముగిసిన హిందీ పక్షోత్సవాలు…………..

బేగంపేట విమానాశ్రయంలో ఈనెల 14న ప్రారంభమై 29 వరకు జరిగిన ఉంది పక్షోత్సవాలు ఘనంగా ముగిశాయి. ముగింపు సందర్భంగా బహుమతి పంపిణీ కార్యక్రమం సోమవారం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ ఇంచార్జ్ వరుడు వి రావు మాట్లాడుతూ 1949 సెప్టెంబర్ 14న రాజ్యాంగ పరిషత్ హిందీకి అధికార భాష హోదా కల్పించిందని అన్నారు అందుకే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీని హిందీ దినోత్సవం గా జరుపుకుంటున్నామన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో హిందీ ముఖ్య పాత్ర పోషించిందని జాతీయ సమైక్యత సమగ్రతను చెక్కుచెదరకుండా ఉంచడంలో హిందీ కృషి ప్రశంసనీయమని వి .వి.రావు అన్నారు. బేగంపేట విమానాశ్రయంలో అధికార భాషకు సంబంధించిన వాళ్లు పనుల గురించి సమాచారం ఇస్తూ హిందీలో వీలైనంత ఎక్కువ పనులు చేసేందుకు అధికారులు ప్రయత్నించాలని వీ.వీ.రావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలలో విజేతలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత్ డైనమిక్ లిమిటెడ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ హోమ నిధి శర్మ మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో ఉంది ప్రభావం పెరుగుతుందని, నేడు భారత్కు చేరువయ్యే పోటీలో ఉన్నాయని, అలాంటి పరిస్థితుల్లో హిందీ బాటలు వేస్తుందని చెప్పారు. కొనసాగుతున్న అధికార భాష పనులను శర్మ ప్రశంసించారు ఈ కార్యక్రమంలో అవార్డు విజేతలకు ముఖ్య అతిథి చేతుల మీదుగా సర్టిఫికెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఏటీసీ జనరల్ మేనేజర్ రూప కుమార్, కమ్యూనికేషన్ జనరల్ మేనేజర్ కె ఎస్ రావు అపూర్వ జైన్,ఉపేందర్ కుమార్,నీతా సురేష్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *