మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 381 దరఖాస్తులు అందాయి.వీటిలో గృహనిర్మాణం శాఖ కు సంబంధించి 72, ఎస్సీ సంక్షేమ శాఖ కు సంబంధించి 56, రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 51, విద్యుత్ శాఖ కు సంబంధించి 40, పంచాయతి రాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖ కు సంబంధించి 28, మైనారిటీ వెల్ఫేర్ శాఖకు సంబంధించి 25, ప్రవాసీ ప్రజావాణి ద్వారా 5, ఇతర శాఖలకు సంబంధించి 94 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డా.జీ.చిన్నారెడ్డి, ప్రజాపాలన ప్రత్యేక అధికారి శ్రీమతి దివ్య లు ఈ కార్యక్రమంలో పాల్గొన్ని దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాభవన్ కు వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

