రతన్ టాటా కన్నుమూత

ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూశారు. ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తీసుకుంటున్న ఆయన బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు.
వృద్ధాప్య సమస్యల కారణంగా గత కొంత కాలంగా ఆయన వైద్య చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

రతన్ టాటా చనిపోయారంటూ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘గడియారం టిక్ చేయడం ఆగిపోయింది. టైటాన్ చనిపోయిది. రతన్ టాటా సమగ్రత, నైతిక నాయకత్వం, దాతృత్వానికి ఒక వెలుగు వెలిగారు, ఆయన వ్యాపార, వెలుపలి ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు. ఆయన మన జ్ఞాపకాలలో ఎప్పటికీ ఎదుగుతాడు. ఆర్.ఐ.పి’ అంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *