రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి స్వగ్రామం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంతూర్పునాయుడుపాలెంలో రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆదివారం నాడు పర్యటించారు. హైవే కింద బ్రిడ్జి, గ్రామంలోని వంతెనలు పరిశీలించారు. ఈ సందర్భంగా….వంతెనల కింద గుర్రపు డెక్క తొలగించి, వరద నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పల్లె సీమలు పరిశుభ్రంగా ఉండాలని, వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.


