పంచాయితీలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రర్థ తీసుకోనున్నట్లు ఇన్చార్జి గ్రామకార్యదర్శి ఇడమకంటి రమణా రెడ్డి అన్నారు. నాగంబొట్ల పాలెం గ్రామకార్య దర్శి అయిన ఆయన తాళ్లూరు ఇన్చార్జి గ్రామకార్యదర్శిగా సోమవారం బాధ్యతలు చేపట్టారు. తాళ్లూరు నుండి బదిలీ అయిన గ్రామకార్యదర్శి నూర్ అహ్మద్ ఆయనకు పూర్తి రికార్డులను అప్పగించారు. ఈ సందర్భంగా గ్రామకార్యదర్శి ఐ రమణా రెడ్డి మాట్లాడుతూ ప్రాధాన్యత క్రమంలో పారిశుధ్య పనులు, బోర్ల మరమ్మత్తులు చేపడతామని, పంచాయితీ ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.
