ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డ్రోన్ సమ్మిట్ లో భాగంగా విజయవాడ సి.కె కన్వెన్షన్ లో ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ రోణంకి పాల్గొని ‘గ్రామీణ భారతదేశంలో డ్రోన్ల సహకారంతో డిజిటల్ రికార్డులని సృష్టించుట’ అనే అంశంపై ప్రజెంటేషన్ ని వివరించారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గ్రామీణ ప్రాంతాలలో జరిగిన రీ-సర్వే కార్యక్రమంలో మరియు పట్టణ ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వామిత్వ కార్యక్రమంలో ‘భూసర్వే ప్రక్రియలో డ్రోన్లు వినియోగించి సాంకేతిక సహకారంతో భూమిని కొలిచిన విధానం, మ్యాప్ లు తయారీ మొదలగు అంశాలపై అంశాలపై ఆహుతులకు వివరించడం జరిగింది.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ రోణంకి ఐఏఎస్ ని సత్కరించడం జరిగింది.

