జ్ఞానాన్ని పెంచుకునేందుకు మాత్రమే సెల్ ఫోన్ లు , ఇంటర్నెట్ లో పలు అంశాలను ఉపయోగించాలని, సమాజంలో పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నందు వల్ల బాలికలు చాలా జాగ్రత్తగా ఉండాలని వీకే ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కొండపల్లి ఆంజనేయులు సూచించారు. వి. కె కళాశాల్లో సోమవారం బాలికల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు
సెల్ ఫోన్ లు అవసరమైన అంశాలు, విద్యాభివృద్ధి కోసం మాత్రమే ఉపయోగిం చాలన్నారు. వీకే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనూ బాలికలకు వివిధ అంశాలపై సూచనలు చేశారు. ప్రధానోపాధ్యాయుడు శేషగిరి, ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.
జ్ఞానాన్ని పెంచుకునేందుకు మాత్రమే సెల్ ఫోన్ లు ఉపయోగించాలి -బాలికల భద్రతపై అవగాహన
29
Oct