తాళ్లూరు మండలంలోని తాళ్లూరు, శివ రామ పురంలలో పోలింగ్ కేంద్రాలను దర్శినియోజక వర్గ ఈఆర్ఎ, డిప్యూటీ కెక్టర్ ఎం వి ఎస్ లోకేశ్వర రావు పరిశీలించారు. ఓటర్ల జాబితా చేర్పులు, మార్పుల పరిశీలన నిమిత్తం ఆయా పోలింగ్ కేంద్రాలలో ప్రచురితం కాబోయే ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచటంతో ఆయన పరిశీలించి బి ఎల్ ఓలకు తగిన సూచనలు చేసారు. తాళ్లూరు మండలంలో 46 పోలింగ్ కేంద్రాల పరధిలో ఇప్పటి వరకు 37,736 మంది ఓటర్ల నమోదు అయినట్లు అందులో 19,040 పురుషులు, 18,696 మంది మహిళలు ఉన్నారు. పరిశీలనలో డిప్యూటీ తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ ఇమ్మానియేల్ రాజు తదితరులు పాల్గొన్నారు.
