అద్వెంట్జ్ సమూహం ఆధ్వర్యంలో జైకిసాన్ దివస్ వేడుకలు ఘనంగా నిర్వహణ

పశ్చిమ గోదావరి జిల్లా, పెంటపాడు మండలం, కె.పెంటపాడు గ్రామంలో సోమవారం అద్వెంట్జ్ సమూహం ఆధ్వర్యంలో జైకిసాన్ దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ,

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ కార్యక్రమానికి అద్వెంట్జ్ సమూహం విజయవాడ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎస్.కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజయవాడ ఎండీఓ ఎం.రఫి, తాడేపల్లిగూడెం మార్కెటింగ్ అధికారి ఎం.హరి కిషన్, జైకిసాన్ సభ్యులు ఎం.పుష్పరాజు మరియు డి.సతీష్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సుమారు 45 మంది రైతులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో నాణ్యమైన వ్యవసాయం కోసం సమగ్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించారు. ప్రత్యేకించి రబీ సీజన్‌లో ఎదుర్కొనే వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కోవడానికి అనుసరించవలసిన పద్ధతులపై చర్చించారు.

నానో శక్తి యూరియా, డీఏపీ వంటి ఆధునిక ఎరువుల ప్రాముఖ్యతను వివరించారు. అదేవిధంగా ఎన్-20, జిప్‌మైట్ ప్లస్ వంటి ఉత్పత్తుల గురించి రైతులకు అవగాహన కల్పించారు. మట్టి నమూనాల సేకరణ విధానం మరియు విశ్లేషణ ప్రాముఖ్యతను కూడా వివరించారు.

ఈ సందర్భంగా ఇద్దరు ప్రగతిశీల రైతులను సత్కరించి గౌరవించారు. వరి సాగులో మెరుగైన దిగుబడుల కోసం సమగ్ర యాజమాన్య పద్ధతులను అనుసరించాలని రైతులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *