8 వ రోజు కొనసాగిన పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు (PMT, PET): ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ. ఆర్ దామోదర్

ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డ్ (APSLPRB) నియమ నిబంధనలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పకడ్బంధీగా బుధవారం జిల్లా పోలీసు మైదానంలో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహణ క్రమంలో అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలన, బయోమెట్రిక్, ఎత్తు & ఛాతీ కొలత వంటి ఫిజికల్ మెజర్‌మెంట్‌లు చేయబడతాయని, దేహదారుడ్య పరీక్షలలో భాగంగా 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ వంటి అంశాలను ఆధునిక RFID కంప్యూటరైజ్డ్ టెక్నాలజీ ద్వారా సాంకేతిక పరిజ్ఞానం పరికరాలతో పకడ్బందీగా జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

బుధవారం 448 మంది అభ్యర్దులు దేహదారుఢ్య పరీక్షలకు హజరయ్యారు. వీరిలో 332 మంది అభ్యర్థులు క్వాలిఫైడ్ అయ్యారు. మహిళలు/పురుషులు అప్పీల్ చేయదలచిన అభ్యర్థులు 10 న జిల్లా పోలీస్ గ్రౌండ్‌లో తమ అప్పీల్ అందించవచ్చును. దళారులను ఆశ్రయించి మోసపోవద్దని… మెరిట్ ఆధారంగానే ఈ ఉద్యోగాలు వస్తాయని అభ్యర్థులకు జిల్లా ఎస్పీ తెలియజేశారు.

ఈ ఈవెంట్స్ లో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)కె.నాగేశ్వరరావు, ఎస్బి డిఎస్పీ సురేష్ బాబు, దర్శి డిఎస్పీ లక్ష్మి నారాయణ, పిటిసి డిఎస్పీ మాధవ రెడ్డి, పిటిసి డిఎస్పీ లక్ష్మణ్ కుమార్, డీపీఓ AO రామ్మోహన్ రావు, ఐటి కోర్ సీఐ వి.సూర్యనారాయణ, డీటీసీ సీఐ SK.షమీముల్లా, పిటిసి సిఐ శ్రీనివాసరరావు, ఆర్ఐలు రమణారెడ్డి, సీతారామిరెడ్డి, షైక్ ఖాసీం, ఎస్సైలు, డీపీఓ సిబ్బంది, మెడికల్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *