ప్రస్తుతం ఉన్న వృత్తిలో కలిగి ఉన్న జ్ఞానాన్ని మరింత పెంపొందించుకునేందుకే ప్రభుత్వం ఐసీడీఎస్, విద్యాశాఖ సంయుక్తంగా సపోర్టివ్ ఆంధ్ర లెర్నింగ్ ట్రాన్స్ఫార్మింగ్ ( ఎస్ ఏ ఎల్ టి) సహకారంతో ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తున్నట్లు మండల విద్యాశాఖాధికారి జి సుబ్బయ్య, ఎంఈఓ – 2 సుధాకర రావు లు తెలిపారు. వికే ఉన్నత పాఠశాలలో మంగళవారం అంగన్వాడీ టీచర్లకు సాల్ట్ ఆధ్వర్యంలో జ్ఞాన జ్యోతి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక ట్రైనర్, వికే ఉన్నత పాఠశాల హెచ్ఎం శేష గిరి మాట్లాడుతూ అంగన్ వాడీ టీచర్లు గతంలో ఈసీఈ కు సంబంధించిన జ్ఞానాన్ని మాత్రమే కలిగి ఉంటారని … శిక్షణలో పీపీఈ- 1,2 లతో పాటు ఒకటి రెండు తరగతులను కూడ డీల్ చేసే విధంగా తర్పీదు ఇస్తామని చెప్పారు. శిక్షణ విద్యార్థులకు మరింత సులభంగా అర్థం అయ్యే విధంగా చెప్పెందుకు వీలుంటుందని అన్నారు. అంగన్ వాడీ సూజర్ వైజర్ జ్యోతి, సీఆర్పీలు శ్రీ మన్నారాయణ, చంద్రిక, శివ రామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

