వ్యవసాయ, రెవిన్యూ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేసి
రైతులకు పారదర్శక సేవలు అందించాలని తహసీల్దార్ ఇమ్మానియేల్ రాజు, వ్యవసాయాధికారి ప్రసాద రావులు కోరారు. తాళ్లూరులో తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం విఆర్ఓ లలకు, విఏఏల కు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్లో గాని, ఈ పంట నమోదు రికార్డులలో గాని విఏఏలు రికార్డు చేసిన వివరాలు సక్రమంగా ఉన్నాయా లేవా అన్ని విషయాలను పరిశీలించి తహసీల్దార్ అప్రూవల్ కు పంపాలని చెప్పారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు త్వరతిగతిన ఆ పనులను పూర్తి చెయ్యాలని కోరారు. డిటి ప్రశాంత్, విఆర్ ఓలు పాల్గొన్నారు.
