బేగంపేట మార్చి 8 ( జేఎస్ డి ఎం న్యూస్) :
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బేగంపేట బ్రాహ్మణవాడిలోని స్వామి రామానంద మెమోరియల్ భవనంలో పారిశుద్ధ్య కార్మికులను కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారితో కలిసి కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి మాట్లాడుతూ ప్రతి మహిళ ఆర్థికంగా ఉన్నతంగా ఎదగాలని, ఆకాంక్షించారు. వారికి తోచిన రంగంలో నచ్చిన పనులలో మరింత పైకి ఎదగాలని తాను కోరుకుంటున్నానని కార్పొరేటర్ అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు శ్రీహరి, సురేష్, రాజయ్య పారిశుద్ధ్య సిబ్బంది మహిళలు పాల్గొన్నారు.

