బేగంపేట మార్చ్ 24 (జేఎస్ డి. ఎం న్యూస్) : రాహుల్ ప్రియాంక గాంధీ సేన కాంగ్రెస్ ను జిల్లాల వారీగా మరింత బలోపేతం చేస్తున్నామని రాహుల్ ప్రియాంక గాంధీ సేన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫయాజ్ అన్నారు సోమవారం బేగంపేట పాటిగడ్డలోని కార్యాలయంలో 25 మందికి వివిధ హోదాలో నియమిస్తూ నియామక పత్రాలు అందించారు ఈ సందర్భంగా మహమ్మద్ ఫయాజ్ మాట్లాడుతూ రాహుల్ ప్రియాంక గాంధీ సేన కాంగ్రెస్కు ఇప్పటికే వివిధ జిల్లాల కమిటీల నియామకం పూర్తిచేశామన్నారు అలాగే జంట నగరాల పరిధిలో కూడా వివిధ నియామకాలు చేస్తున్నామన్నారు సోమవారం నాగోల్ ఉపాధ్యక్షురాలుగా చింతల రాధిక నాగోల్ ప్రధాన కార్యదర్శిగా జ్యోతిబండ వడ్లమూడి శ్రీదేవి అడ్రస్ శ్రావణి వడ్లమూడి ప్రేమ్ కుమార్ వసంత నాగమణి విజయ్ కుమార్ జి రజిత అనూష వాసుదేవరెడ్డి మహేషులతో పాటు మరికొందరిని వివిధ పోస్టుల్లో నియమిస్తూ నియామక పత్రాలను ఆయన అందించారు ఈ సందర్భంగా నియామక పత్రాలు స్వీకరించిన వారు మాట్లాడుతూ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తామని తమ పరిధిలో రాహుల్ ప్రియాంక గాంధీ సేన కాంగ్రెస్ ను
మరింత బలోపేతం చేస్తామన్నారు.

