భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతీ నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న “మన్ కీ బాత్ “. 120 వ కార్యక్రమం అత్యంత ప్రజాదరణ పొందుతున్న విషయం తెలిసినదే అని, వారి మనుసులోని మాటలు కార్యరూపం దాల్చేలా వారు చేస్తు న్న కృషికి భారతీయులంతా సహకరించాలని భారతీయ జనతాపార్టి జిల్లా మీడియా కన్వీనర్ ధనిశెట్టి రాము నాయుడు తెలిపారు. మనకీ బాత్ కార్యక్రమం పై వివరిస్తూ.. గత కొన్నేళ్లుగా వివిధ సంస్థల సర్వేలలో ప్రపంచంలో కని వినీ ఎరుగని రీతిలో అత్యంత శక్తి వంతుడైన నాయకుడిగా ప్రజల మన్ననలు పొందుతూ ఉన్నారని, సామాన్య ప్రజలను సైతం ప్రభావితం చేస్తున్న కార్యక్రమం “మన్ కీ బాత్ ” అని. ప్రతి ఒక్కరూ తమ సంప్రదాయాల ప్రకారం తమ దేవతా మందిరాలకు వెళ్లిన విధముగా.. మరి దేశం కోసం ధర్మం కోసం తనజీవితాన్ని ధారపోసి అఖండ భారతావనిని విశ్వగురువుగా తీర్చిదిద్దాలనే మహాదాశయంతో పని చేస్తున్న ప్రధాని మోదీ కృషి కి మనం కూడా చేదోడుగా నిలవాలంటే ప్రతీ నెల ఆఖరి ఆదివారం మనం కూడా కార్యక్రమం. యెక్క ప్రధాన్యత ను గుర్తేరిగి. ఒక్క బీజేపీ కార్యకర్తలే కాకుండా ప్రతి ఒక్కరూ, భారతీయులు, దేశాన్ని అభిమానించే వారందరూ నేటి ఆదివారం ఉదయం 11.00 నుండి 11:30 వరకు. హిందీలో, మరియు 11:30 నుండి 12:00 గంటలకు దూర దర్శన్ సప్తగిరి ఛానెల్ లో వస్తున్న “మన్ కీ బాత్” కార్యక్రమం వీక్షిం చాలని బీజేపీ ప్రకాశం జిల్లా మీడియా కన్వినర్ ధనిశెట్టి రామునాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు
