బేగంపేట మార్చి 30(జే ఎస్ డి ఎం న్యూస్) :
తెలుగు సంవత్సరాది ఉగాది విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ను బేగంపేట సీనియర్ కాంగ్రెస్ నాయకులు విశాల్ సుధాం,గౌరపల్లి రమేష్ ల ఆధ్వర్యం లో కలిసి బొకే అందించి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.బండి రమేష్ ను కలిసిన వారిలో జగదీష్,చిరంజీవి,శేఖర్, బాలు, భీమ్,మనోజ్, మోహిత్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా బండి రమేష్ వారికి బేగంపేట డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను గురించి తెలియజేశారు.

