తాళ్లూరు మండలంలో ఆదివారం భక్తి శ్రర్థలతో తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు నిర్వహించారు. ప్రజలు ప్రసిద్ధ దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురోహితులు భక్తులకు, ప్రజలకు ఉగాది పచ్చడి పంచి పెట్టారు. పంచాగ శ్రవణం చేసారు.
ప్రారంభమయిన వెంకట రామయ్య స్వామి తిరునాళ్ల…
అవదూత వెంకట రామయ్య స్వామి తిరునాళ్ల ఆదివారం ప్రారంభయినది. స్వామి వంశస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదానం నిర్వహించారు. స్వామి వంశస్తులు పాట కచేరిని, టిడిపి తూర్పుపాలెం నాయకుడు ఇడమకంటి క్రిష్ణా రెడ్డి ఆద్వర్యంలో పాట కచేరిని ఏర్పాటు చేసారు.
