వేసవిలో తాగునీటి ఎద్దడిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి -ఏ ఒక్క గ్రామంలో తాగునీటి సమస్య ఉండకూడదు -మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి

వేసవిలో తాగునీటి ఎద్దడిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. మంగళవారం నాడు తూర్పు నాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో కొండపి నియోజకవర్గ ఆర్ డబ్ల్యూఎస్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని గ్రామాల్లో నీటి సరఫరా వివరాలు, సమస్యలు అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. టంగుటూరు,పొన్నలూరు, జరుగుమల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో పైప్ లైన్ ద్వారా నీటి సరఫరాకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…వేసవిలో తాగునీటి ఎద్దడిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ఏ ఒక్క గ్రామంలో త్రాగునీటి సమస్య ఉండకూడదు. నీటి సరఫరాకు ఎక్కడైనా సమస్యలు తలెత్తితే అధికారులు అందుబాటులో ఉండి వెంటనే పరిష్కరించాలి.
పొలాల్లో పశువులకు నీరందిoచే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి డా.డోలా బాల వీరాంజ నేయస్వామి అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *