మణికొండ మే 15 (జే ఎస్ డి ఎం న్యూస్)
మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు.భారత్ వికాస్ పరిషత్ మణికొండ జిజియా భాయ్ శాఖ తరపున నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు, సుమారు 500 మంది మునిసిపల్ సిబ్బంది మరియు పారిశుద్ధ కార్మికులకు క్యాన్సర్ అవగాహన సదస్సును మరియు అనీమియా ముక్తుభారత్ క్యాంప్ ను,సాయి లక్ష్మి పంచవటి కాలనీ కమ్యూనిటీ హాల్, రోడ్ నెంబర్ 4 లో గురువారం నిర్వహించారు. భారత వికాస్ పరిషత్ డాక్టర్ గీతా నాగశ్రీ ఆంకాలజిస్ట్ రీజినల్ మహిళా ప్రముక్, ప్రాంత ఉపాధ్యక్షులు డాక్టర్ రఘు సతీష్ కుమార్ లు హాజరయ్యారు.ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ , ఫార్మర్ చైర్మన్ కస్తూరి నరేందర్ ,ఫార్మర్ వైస్ చైర్మన్ k.నరేందర్ రెడ్డి , బిజెపి అధ్యక్షులు రవి కాంత్ రెడ్డి, ధూళిపాల లు హాజరు కాగా గౌరవ అతిథులు గా బీరప్ప, సిద్ధప్ప , యాలాల నరేష్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్యాంపు ను జిజాబాయి బ్రాంచ్ చీప్ ప్యాట్రన్ ఎస్ బి. రాజశేఖర్, అడ్వైజర్ ప్రభుజి , అధ్యక్షులు ఎం. పెంటారెడ్డి , జనరల్ సెక్రటరీ కే. బాల భారతి, ఫైనాన్స్ సెక్రటరీ టి. హరిహర అజయ్ కుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ భాస్కర్,వారి సహచర బృందంతో నిర్వహించారు. లో సుమారు 200 మందికి హిమోగ్లోబిన్ టెస్ట్ అనీమియా ముక్త్ భారత్ తరపున నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంత ఉపాధ్యక్షులు డాక్టర్ రఘు సతీష్ కుమార్ , ఫార్మర్ వైస్ చైర్మన్ కే నరేందర్ రెడ్డి , మున్సిపల్ కమిషనర్, ఆంకాలజిస్ట్ డాక్టర్ గీత నాగశ్రీ క్యాన్సర్ పై వారికి పలు సూచనలు చేయడం తో పాటు అవగాహన కల్పించారు.


