హైదరాబాద్ మే 16( జే ఎస్ డి ఎం న్యూస్ ప్రధాన ప్రతినిధి) :
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలోనిచర్చిల వద్ద ప్రతి ఆదివారం క్రిస్టియన్స్ ప్రార్థనలు చేసే సమయంలో వాహనాలు రోడ్డు ప్రక్కన పెడుతుంటే ట్రాఫిక్ పోలీస్ లు చాలాన్లు వేస్తున్నారని, ఈ సమస్యను నివారించాలని కోరుతూ బిషప్స్, పాస్టర్స్, క్రిస్టియన్ సంఘం ప్రతినిధులు సీఎం ప్రజావాణి ఇంచార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జీ. చిన్నారెడ్డికి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.
ఈ సమస్యపై వెంటనే స్పందించిన చిన్నారెడ్డి
డీజీపీకి లేఖ రాశారు. చర్చిల వద్ద చాలాన్ల సమస్య రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని చిన్నారెడ్డిఆలేఖలోపేర్కొన్నారుక్రిస్టియన్స్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోనే సాల్మన్ రాజ్ నేతృత్వంలో ప్రతినిధులు సీఎం ప్రజావాణికి వచ్చారు.

